"కామాఖ్యలో భక్తి vs వ్యాపారం: దేవాలయ పుణ్యభూమి – దుర్వినియోగాల వేదికగా మారుతుందా?“

 కామాఖ్యలో భక్తి vs వ్యాపారం: దేవాలయ పుణ్యభూమి – దుర్వినియోగాల వేదికగా మారుతుందా?“

కామాఖ్య దేవాలయం – శక్తిపీఠాలలో అగ్రగణ్యమైన ఈ పుణ్యక్షేత్రం నాకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చింది. ముఖ్యంగా అమ్మవారి కథలో దేవి పార్వతిదేవి తన భర్త శివుడిని గౌరవించేందుకు తన తండ్రి దక్షుని ఎదిరించిన ధైర్యం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది. అయితే ఈ భక్తిమయమైన యాత్రలో ఒక చేదు అనుభవం కూడా ఎదురైంది — ఆలయంలో కొంతమంది పండితుల (పండాల) ప్రవర్తన. వారు పూజల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ, భక్తుల మీద ఒత్తిడి తేవడం, మర్యాదలేకుండా ప్రవర్తించడం గమనించాను. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే చర్య. కొంతమంది భక్తులు భయంతోనే డబ్బు ఇస్తున్నారు, మరికొంతమంది అవమానానికి గురవుతున్నారు. ఈ వ్యవస్థను నిరుత్సాహపరిచేందుకు భక్తులు UPI లాంటి పారదర్శకమైన చెల్లింపు మార్గాలను ఉపయోగించాలి. ఇది కేవలం కామాఖ్య దేవాలయానికి పరిమితం కాకుండా, పూరీ జగన్నాథ ఆలయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా కొంతమంది పండితులు విదేశీ భక్తుల నుంచే కాక దేశీయ భక్తుల నుంచీ బలవంతంగా డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఆలయ పరిపాలనలో ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి విరుద్ధంగా, తిరుమలలో టిటిడి పాలనను చూసినప్పుడు ఒక ఉత్తమ నమూనా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ టోకెన్లు, ఆన్‌లైన్ చెల్లింపులు, క్యూలైన్ వ్యవస్థలు భక్తుల కోసం పారదర్శకంగా రూపొందించబడ్డాయి. భక్తులకు అక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా పూజలు చేయించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి విధానం ఆస్సాం, ఒరిస్సాలోని ఆలయాలలో అమలవ్వాల్సిన అవసరం ఉంది. భక్తులుగా మనం కూడా సమాజంలో జరిగే తప్పులపై ప్రశ్నించాలి, తప్పు చూసి మౌనంగా ఉండకూడదు. దేవాలయాలు భక్తికి కేంద్రంగా ఉండాలి, వ్యాపారానికి కాదు. శక్తి పీఠాల పవిత్రతను రక్షించాలంటే ప్రభుత్వాలు, ట్రస్టులు, భక్తులు కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలి. ఆలయాలు దయ, భక్తి, శాంతికి నిలయాలుగా ఉండాలి — దౌర్జన్యానికి, లాభాపేక్షకు కాదని గుర్తించాల్సిన సమయం ఇది.


Comments

Popular posts from this blog

"Pavan's Journey of Milestones"

భారత ఉపఖండం